‘ఎంఐ మ్యాక్స్‌ 3’ వచ్చేసింది

ప్రముఖ మొబైల్ సంస్థ షియోమీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేసింది. తాజాగా, ‘ఎంఐ మ్యాక్స్‌ 3’ విడుదల చేశారు. భారీ స్క్రీన్ డిస్‌ప్లే, బ్యాటరీ బ్యాకప్.. లాంటి ఆకట్టుకునే ఫీచర్లతో ఎంఐ మ్యాక్స్‌3 ని తీసుకొచ్చారు. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.17,320లు నిర్ణయించారు. ఇక, 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,375లకు లభించనుంది.

ఎంఐ మ్యాక్స్‌ 3 ఫీచర్లు :

* 6.9″ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

* 5500ఎంఏహెచ్‌ బ్యాటరీ

* 2160 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

* ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌

* 4/6జీబీ ర్యామ్, 64/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌

* ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం

* 12/5 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా (ఎల్ఈడీ ఫ్లాష్‌)

* ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌