బాలీవుడ్.. నాగ్ తో కట్టేది ఈవిడే !

దాదాపు 15యేళ్ల తర్వాత నాగార్జున బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ‘బ్రహస్త్ర’ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ – ఆలియా భట్ – మౌని రాయ్ లు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ తో జాయిన్ అయ్యాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా నటించేది ఎవరు ? అన్నది తెలిసిపోయింది. సీనియర్ బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ అత్తగారు అయిన డింపుల్ కపాడియా నాగ్ కి జోడీగా కనిపించనుంది. వయసులో ఆమె నాగార్జున కంటే మూడేళ్ళు పెద్దది. ఈ సినిమాలో నాగార్జున-డింపుల్ పార్వతీ దేవి తల్లిదండ్రులుగా కనిపించబోతున్నట్టు సమాచారమ్. అప్పట్లోనే బికినీలతో కుర్రకారుని ఒక ఊపు ఊపింది డింపుల్. ఇప్పుడీ రొమాంటిక్ సీనియర్ హీరోయిన్ నాగ్ కి జోడీగా నటించనుంది.