అత్త పనైపోయింది.. !

మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య – అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ టైటిల్ రోల్ లో నటిస్తోంది. ఇప్పుడీ అత్త పని పూర్తి చేసింది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ విషయాన్ని దర్శకుడు మారుతి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రమ్యకృష్ణతో కలిసి దిగిన ఒక సెల్ఫీని మారుతి పోస్ట్ చేశాడు. ‘రమ్యకృష్ణ తన అభిమాన నటి.. ఆమె నటన అద్భుతమంటూ’ అంటూ కామెంట్ పెట్టారు మారుతి.

టాలీవుడ్ లో అత్త పాత్రలు కొత్తేమీ కాదు. ఈ సినిమాలోనూ రమ్యకృష్ణ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ కి తల్లిగా, చైతూకి అత్తగా కనిపించనుంది. ఆమె పాత తరం అత్తకు ఉన్న లక్షణాలతోనే కనిపించనుంది. ఆమె శ్రీమంతురాలు .. అహంభావం కలిగిన అత్తగారు పాత్రలో అదరగొట్టేయనున్నారు. గతంలో ఎన్టీఆర్ అత్తగా రమ్యకృష్ణ నటించింది. ఇదీగాక, రజనీకాంత్ ‘నరసింహా’ లో పొగరుబోతు పాత్రలో అద్భుతంగా నటించింది. ఇప్పుడు మరోసారి రమ్యకృష్ణ పొగరుని మరోసారి తెరపై చూడబోతున్నాం.