టీటీడీ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో పిల్…!

టీటీడీలో అర్చకుల తొలగింపు, పింక్ డైమడ్ వ్యవహారంపై గురువారం సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు సుబ్రమణ్య స్వామి తెలిపారు. రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేయాలని పిల్ లో కోరారు. టిటిడిలో ఆభరణాల భద్రత, నేలమాలిగల వ్యవహారంపై ఇప్పటికే ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే.

సుబ్రమణ్య స్వామి వ్యాజ్యంపై ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకునే పనిలో ప‌డింది టిటిడి. గతంలో సిబిఐ విచారణ డిమాండ్ ను కేంద్ర న్యాయ మంత్రిత్వ‌శాఖ‌ తోసి పుచ్చింది. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో పిల్ పై సర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది.