టీడీపీపై కోపంతో ప్ర‌త్యేక‌హోదాను తిర‌స్క‌రించొద్దు..!!

రాజ‌కీయంగా కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి కామెంట్స్ చేయ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ ట్విట్ట‌ర్ లో స్పందించారు. శుక్ర‌వారం అవిశ్వాసంపై పార్ల‌మెంటులో కీల‌క చ‌ర్చ జ‌ర‌గుతున్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌యోజ‌నాల‌పై కేంద్రానికి ప‌లు విజ్ఞ‌ప్తులు చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌త్యేక హోదాపై కేంద్రానికి విన్న‌వించారు ప‌వ‌న్.

టీడీపీ నాయ‌క‌త్వంపై కార‌ణంగా బీజేపీ ఏపికి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదాను తిర‌స్క‌రించొద్ద‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. ఏపీ ప్ర‌జ‌ల‌తో క‌లిసి బీజేపీ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసేది ఒక్క‌టేన‌ని ఏపికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. పార్ల‌మెంటు కంటే స‌రైన వేదిక ఏదీ లేద‌ని, ఏపీకి న్యాయం చేయండంటూ ట్వీట్ చేశారు ప‌వ‌న్.