అవిశ్వాసంపై శివ‌సేన షాకింగ్ డెసిష‌న్..!!

బీజేపీ మిత్ర‌ప‌క్షం శివ‌సేన షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మాణం నేప‌థ్యంలో పార్ల‌మెంటులో తాము ఎటువైపు అనేది వెల్ల‌డించారు ఆపార్టీ ఎంపీలు. అవిశ్వాసానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటు వేయబోమని తేల్చి చెప్పింది ఆపార్టీ. అవిశ్వాస చ‌ర్చ జ‌రిగే ఈ రోజున స‌మావేశాల‌ను బ‌హిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. శివసేన ఎంపీలు శుక్రవారం లోక్‌సభకు హాజరు కావడం లేదని ఆ పార్టీ ఎంపీ భావన గవాలీ పాటిల్ తెలిపారు. అవిశ్వాస చ‌ర్చ‌పై తాము లోక్‌సభకు హాజరు కావడం లేదని, పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే నిర్ణయం మేరకు తాము లోక్‌సభను బహిష్కరిస్తున్నామ‌ని ఆమె తెలిపారు. శివ‌సేన నిర్ణ‌యం వ‌ల్ల బీజేపీకి జ‌రిగే న‌ష్ట‌మేమీ లేన‌ప్ప‌టికీ భ‌విష్య‌త్ ప‌రిణామాల‌పై ఆ పార్టీ కాస్త డైలామాలో ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది.