రేవంత్’కు ఆ ప‌ద‌వి ద‌క్కేనా..?

టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్, రేవంత్ రెడ్డి గాంధీభ‌వ‌న్ లో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. రేపు ఉత్త‌మ్ ఢిల్లీలో రాహుల్ తో స‌మావేశంలో పాల్గొన‌నున్న నేప‌థ్యంలో వీరిద్ద‌రి భేటీకి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇరువురు నేత‌ల భేటీపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ భేటీలో పార్టీ ప‌ద‌వుల‌పై చ‌ర్చించిన‌ట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌విని రేవంత్ ఆశిస్తున్న సంగ‌తి తెలిసిందే. రేపు ఢిల్లీలో జ‌రిగే సీడ‌బ్య్లూసీ స‌మావేశం త‌రువాత రేవంత్ ప‌ద‌విపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఢిల్లీకి వెళ్లేవారిలో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్, జానారెడ్డి, ష‌బ్బీర్ అలీ, ఏఐసీసీ కార్య‌ద‌ర్శులు మ‌ధుయాష్కీ, వీహెచ్, చిన్నారెడ్డి, సంప‌త్ ఉన్నారు. రేపు ఉద‌యం 10గంట‌ల‌కు సీడ‌బ్య్లూసీ మీటింగ్ లో వీరంతా పాల్గొన‌నున్నారు. సాయంత్రం 5గంట‌ల‌కు రాహుల్ తో ఉత్త‌మ్ స‌మావేశం కానున్నారు.