‘హోదా’ కోసమే కాంగ్రెస్ లో చేరా..!

ఏపీకి ప్రత్యేక హోదా కోసమే కాంగ్రెస్ లో చేరాన‌ని బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది.. తెచ్చేది కాంగ్రెసేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్రాంతీయ పార్టీలతో ప్రత్యేక హోదా రావడం కల్ల అని తేల్చి చెప్పారు. చంద్రబాబు, జగన్ ల ఆరాటం అంతా పదవులపైనే తప్ప ప్రజల కోసం కాదని, తెలంగాణ విభజన పాపం కాంగ్రెస్ ది కాదని ఆయ‌న అన్నారు. ప్రత్యేక హోదా సమస్య.. ఉద్యమం రావడానికి కారణం చంద్రబాబు, జగన్ లే కార‌ణ‌మ‌న్నారు.

చంద్రబాబు, జగన్ వల్లే తెలంగాణ విభజన జరిగిందని, వాళ్లు వద్దని ఉంటే తెలంగాణ విభజనే జరిగేది కాదని అన్నారు బైరెడ్డి. చంద్రబాబు లేఖ ఇవ్వడాన్ని వ్యతిరేకించే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాన‌ని, ఇప్పుడు ఏపీకి అపర సంజీవని ప్రత్యేక హోదా కాబట్టి కాంగ్రెస్ లో చేరాన‌ని ఆయ‌న తెలిపారు. ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తానని రాహుల్ బహిరంగ ప్రకటన చేశారని, త్వరలో కర్నూలులో బహిరంగ సభ పెట్టి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయిస్తాన‌ని ఆయ‌న అన్నారు. ఈ నెల 24న బంద్ పిలుపును ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు.