పోలీసులు కాలిస్తే ముందు నేనుంటా…!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఉండవల్లిలో పొలాలను పరిశీలించారు. అక్క‌డి రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. కొంద‌రు రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌వ‌న్ కు వివ‌రించారు. త‌మ పొలాల్లోకి వెళ్లేందుకు కూడా తాము ఆధార్ కార్డు చూపించాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని రైతులు ప‌వ‌న్ కు త‌మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కొన్నేళ్లుగా నిద్రలేని రాత్రులను గడుపుతున్నామనని, ఏ క్షణాన తమ భూములు లాక్కొంటున్నారని భ‌యపడుతున్నామని రైతులు ప‌వ‌న్ కు విన్న‌వించుకున్నారు. త‌మ‌ భూముల్లో పంటలు పండటం లేదంటూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని రైతులు త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని రైతుల‌కు ప‌వ‌న్ హామీ ఇచ్చారు. పొలాల్లో 144 సెక్షన్ గురించి తాను డీజీపీతో మాట్లాడుతానని చెప్పారు.