ఆగస్టు 9న రైల్వేలో ఆన్‌లైన్‌ పరీక్ష

రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌, టెక్నీషియన్ల 26,502 పోస్టుల భర్తీకి పరీక్ష తేదీని ప్రకటించారు. ఆగస్టు 9న ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇది రైల్వే నిర్వహిస్తున్న తొలి ఆన్ లైన్ పరీక్ష కావడం విశేషం. ఈ పోస్టులకు 47.56 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల అవగాహన కోసం ఈనెల 26న ఆన్‌లైన్‌లో మాక్‌టెస్ట్‌ నిర్వహిస్తామని, అభ్యర్థులు పరీక్షకు నాలుగు రోజుల ముందు వారి వివరాలతో హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.