చంద్రబాబు మోసాన్ని బయటపెట్టిన పవన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన మోసాన్ని బయటపెట్టాడు. అది కూడా 2014 ఎన్నికలకు సంబంధించినది. ఆ ఎన్నికల్లో పవన్ భాజాపా-టీడీపీ కూటమికి భుజం కాసిన సంగతి తెలిసిందే. పవన్ సపోర్టు వలనే అధికారంలోకి రాగలిగామని చంద్రబాబు పలుమార్లు అన్నట్టు అపట్ట్లో వార్తలొచ్చాయ్. నాలుగేళ్లు గడిచేసరికి పరిస్థితులు మారాయి. మిత్రులు పవన్, చంద్రబాబు శత్రువులయ్యారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఢీకొనబోతూన్నారు. అప్పుడు టీడీపీ గెలుగు కోసం భుజం కాసిన పవన్.. ఇప్పుడు అదే టీడీపీ ఓటమి బాధ్యతని భుజాలపై వేసుకొన్నాడు.

ఈ క్రమంలో ఆనాడు చంద్రబాబు చేసిన మోసాన్ని పవన్ బయటపెట్టాడు. ‘2014 ఎన్నికల్లో 60 లేదా 70 స్థానాలకు పోటీ చేస్తానని చంద్రబాబుతో చెప్పాను.. మీరు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల తర్వాత రాజ్యసభ సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఆ రోజు మాట్లాడింది వేరు మరుసటి రోజు వారి పేపర్లలో చంద్రబాబు రాయించింది వేరు. అప్పుడే చంద్రబాబుకు ఒక నమస్కారం పెడదాం అనుకున్నాను. తరవాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. నేను ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే నాకు కొన్ని సీట్లు వచ్చేవె’ ని చెప్పుకొచ్చారు పవన్‌ కల్యాణ్‌. ఆదివారం విజయవాడలోని ఎంబీ భవన్‌లో పవన్‌ విలేకరులతో మాట్లాడిన పవన్ ఈ సంచనల వ్యాఖ్యలు చేశారు. మరీ.. దీనిపై చంద్రబాబు రియాక్షన్ ఏంటీ ? అనేది చూడాలి.