కవిత ఛాలెంజ్’ని స్వీకరించిన రాజమౌళి

ఎంపీ కవిత విసిరిన ఛాలెంజ్’ని దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. రాజమౌళికి కవిత హరితహారం ఛాలెంజ్ ని విసిరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూడు మొక్కలని నాటాలని కోరింది. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన రాజమౌళి మర్రి, గుల్మొహర్, వేప మొక్కలను నాటారు. ఈ విషయాన్ని జక్కన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. “కవితగారు మీ చాలెంజ్ ను స్వీకరించా. మర్రి, గుల్మొహర్, వేప మొక్కలను నాటా. పుల్లెల గోపిచంద్, కేటీఆర్, దర్శకులు సందీప్ వంగ, నాగ్ అశ్విన్ లను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఫిట్ నెస్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని సినీ, రాజకీయ ప్రముఖులు స్వీకరించారు. ఇదే తరహాలో హరితహారం ఛాలెంజ్ కూడా ఫేమస్ అవుతుందేమో చూడాలి.

‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు రాజమౌళి. బాలీవుడ్ సినిమాలే సాధ్యం కానీ కలెక్షన్స్ ని ‘బాహుబలి’ సాధించింది. ప్రస్తుతం జక్కన్న తారక్-చరణ్ ల మల్టీస్టారర్ ని తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఈ అక్టోబర్ లో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. 2020లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. బాహుబలి రేంజ్ లో నే తారక్-చరణ్ ల మల్టీస్టారర్ తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేసుకొంటున్నారు. ఈ మల్టీస్టారర్ కోసం పలువురు బాలీవుడ్ నటీనటులని తీసుకోనున్నట్టు సమాచారమ్.