‘సైరా’ 3పాటలు రెడీ !

మెగా అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ‘సైరా’ సినిమా కోసం మూడు పాటలు రెడీ అయ్యాయి. అసలు ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు ? అనే విషయంలో క్లారిటీ లేదు. ముందుగా ఈ సినిమా కోసం థమన్ సంగీతాన్ని అందించబోతున్నట్టు తెలిసింది. ‘సైరా’ మోషన్ పోస్టర్ కు థమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. దీంతో సినిమాకు ఆయన్నే తీసుకొన్నారని చెప్పుకొన్నారు. ఆ తర్వాత మెగాస్టార్ ఇళయరాజ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని ఆ తర్వాత తెలిసి వచ్చింది. కీరవాణి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐతే, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

తాజాగా, సైరా కోసం మూడు పాటలు రెడీ అయినట్టు చెబుతున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సైరాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన మూడు పాటలని కూడా రెడీ చేసినట్టు సమాచారమ్. ఇందులో నిజమెంత ? అనేది తెలియాలంటే చిత్రబృందం ఓ ప్రకటన చేయాల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ తెరకెక్కుతోంది. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమాగా నిలుస్తుందని ఆశపడుతున్నారు. సైరా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వచ్చే యేడాది వేసవిలో ‘సైరా’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.