త్వ‌ర‌లో 20వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ…!

త్వ‌ర‌లో ఏపీలో 20 వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తున్న‌ట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ అన్నారు. ఈ నాలుగేళ్లో దాదాపు ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేట్ రంగంలో దాదాపు 10 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించామ‌ని ఆయ‌న తెలిపారు. త్వ‌ర‌లోనే 10 లక్ష‌ల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వ‌నున్నట్లు ఆయ‌న చెప్పారు.మోడి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని చెప్పి క‌నీసం 20 ల‌క్ష‌ల మందికి కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వ‌లేకపోయార‌ని, మోడి ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకు పోయింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.