సెట్స్ లో గొడవ.. ఆగిపోయిన రామ్ సినిమా షూటింగ్ !

యంగ్ హీరో రామ్ సినిమా సెట్స్ లో గొడవ జరిగిన విషయంలో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామ్ తాజా చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. రామ్ కి జంటగా అనుపమ పరవేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ లో పెద్ద గొడవ జరిగినట్టు సమాచారమ్. దర్శకుడు చెప్పాల్సిన పనులను రైటర్ చెబుతుండటమే ఇందుకు కారణమని తెలిసింది. దీంతో ఇగో హర్ట్ అయిన సినిమాటోగ్రాఫర్ ఫైర్ అయ్యాడట. ఏమైనా చెబితే దర్శకుడు చెప్పాలి. కానీ రైటర్ చెప్పడం ఏంటని అసహనం వ్యక్తం చేశాడట. ఈ గొడవ కారణంగా ఒక రోజు షూటింగ్ ఆగిపోయినట్టు చెబుతున్నారు. చివరకు దర్శకుడు త్రినాథరావు కలుగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దినట్టు ఫీల్మ్ నగర్ సమాచారమ్.

‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమా తర్వాత రామ్ చేస్తున్న చిత్రమిది. రామ్ – అనుపమ వరుసగా రెండోసారి జతకడుతున్నారు. ఇక, సినిమా చూపిస్త మామ, నేను లోకల్‌ లాంటి హిట్స్ సినిమాలు అందించాడు త్రినాథరావు. ఈ హిట్ సినిమాల దర్శకుడు తనకో హిట్ ఇస్తాడనే ఆశతో రామ్ ఉన్నాడు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.