ప్ర‌శ్నించ‌డ‌మేకాదు… పాలిస్తాం కూడా.. !

జ‌న‌సేన పార్టీ ప్ర‌శ్నించే పార్టీ మాత్రమే కాద‌ని, ప‌రిపాలించే పార్టీ అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. భీమ‌వ‌రంలో ప‌ర్య‌టించిన ఆయ‌న యువ‌శ‌క్తిని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్, టీడీపీలు ప‌రిపాలించాయ‌ని, ఇక జ‌న‌సేన‌కు అవ‌కాశం ఇవ్వండంటూ ప్ర‌జ‌ల‌ను కోరారాయ‌న‌. ఒక సినిమాలో మంచి చెప్పాలంటే కేవ‌లం రెండున్న‌ర గంట‌లు స‌రిపోతుంద‌ని, కానీ అది చేయాలంటే మాత్రం 20ఏళ్లు ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు.

మీ ఇంటి నుంచి ఒక‌డు వ‌చ్చి పార్టీ పెట్టాడంటే అది జ‌న‌సేన పార్టీ మాత్ర‌మేన‌ని, తాను ఇక 25ఏళ్ల వ‌ర‌కు రాజ‌కీయాల్లోనే ఉంటాన‌ని ఆయ‌న చెప్పారు. శ‌క్తి ఉన్న‌ప్పుడే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే సంకల్పంతో ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చాన‌ని ప‌వ‌న్ అన్నారు. తాను దోపిడీ చేయ‌డానికి రాజ‌కీయాల్లోకి రాలేద‌ని, భావిత‌రాల కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పారు.