ఆన్ లైన్’లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సరికొత్త రికార్డు

ఆన్‌లైన్‌ అమ్మకాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రత్యేక ఎడిషన్‌ కింద భారత్‌లోకి తీసుకొచ్చిన 250 యూనిట్ల క్లాసిక్‌ 500 పెగాసస్‌ బైక్‌లు కేవలం 3 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే అమ్ముడయ్యాయి. కేవలం 178 సెకన్లలోనే ఈ బైక్‌లన్నీ అమ్ముడైనట్లు సంస్థ వెల్లడించింది. ఈ బైక్‌ ధర రూ. 2.4 లక్షలు. ఈ ప్రత్యేక ఎడిషన్ కింద కేవలం 1000 బైక్‌లను మాత్రమే తయారుచేసింది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. వీటిలో భారత విపణిలోకి 250 యూనిట్లను తీసుకురాగా.. మిగతా వాటిని యూకే, అమెరికా, ఆస్ట్రేలియాలో విక్రయించనుంది. ఈ బైక్‌ ఆన్‌లైన్‌ విక్రయాలను జులై 10నే చేపట్టింది. ఐతే, వెబ్‌సైట్‌కు సాంకేతికంగా అంతరాయం ఏర్పడటంతో.. . జులై 25న విక్రయాలు చేపట్టారు. https://royalenfield.com/pegasus వెబ్‌సైట్‌లోకి వెళ్లి వినియోగదార్లు ఈ బైక్ ని కొనుగోలు చేశారు. వైంది’ అన్నారు.