నేడు మ‌ధ్యాహ్నం యాదాద్రి ఆల‌యం మూసివేత‌..!!

శుక్ర‌వారం సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం సంద‌ర్భంగా యాదాద్రి ఆల‌యంలో మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మాత్ర‌మే స్వామివారి ద‌ర్శ‌నం కొన‌సాగుతుంది. మ‌ధ్యాహ్నం 12గంట‌ల‌కు స్వామివారికి ఆరగింపు నివేద‌న అనంత‌రం భ‌క్తులకు కొద్దిసేపు స్వామివారి ద‌ర్శ‌నం చేసుకునే అవకాశం క‌ల్పించారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు యాదాద్రి ఆల‌య ద్వార‌బంధ‌నం చేసి ఆలయాన్ని మూసివేస్తారు.

గ్ర‌హ‌ణం విడిచిన అనంత‌రం తిరిగి శ‌నివారం ఉద‌యం 5గంట‌ల‌కు ఆల‌య ద్వారాలు తెర‌చి సంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. అయితే శ‌నివారం తెల్ల‌వారుజామున జ‌ర‌గాల్సిన సుప్ర‌భాత ద‌ర్శ‌నం, నిజాభిషేకం, అభిషేకం, అర్చ‌న‌లు, సుద‌ర్శ‌న హోమం కార్య‌క్ర‌మాలు ర‌ద్దు చేశారు. శ‌నివారం ఉద‌యం 9 నుంచి ఉభ‌య ద‌ర్శ‌నాలు ప్రారంభిస్తారు.