మహేష్-తారక్-చరణ్.. ఫ్యాన్స్’కు పండగే.. !!


ఫ్యాన్స్ పండగ చేసుకొనే చేశారు టాలీవుడ్ స్టార్. మహేష్ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ లని ఒకే ఫ్రేములో చేసుకొని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మహేష్ ‘భరత్ అను నేను’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మహేష్-తారక్-చరణ్ లు ఒకే వేదికపై కనిపించారు. ఇప్పుడు మరోసారి ఈ త్రీ-స్టార్స్ కలిశారు. శుక్రవారం దర్శకుడు వంశీపైడిపల్లి పుట్టినరోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో మహేష్ తో పాటు తారక్, చరణ్ లు కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ త్రీ-స్టార్స్ తోనూ దర్శకుడు వంశీపైపడిపల్లికి మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ ని లుక్ ని మార్చేసిన దర్శకుడు వంశీ. వీరి కలయికలో వచ్చిన ‘బృందావనం’ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కోసం తారక్ తొలిసారి ట్రీమ్ లుక్ లో కనిపించి ఆకట్టుకొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వంశీ చేసిన ‘ఎవడు’ బాగా ఆడింది. ఇందులో చరణ్, బన్నీలని చూపించిన విధానం ఆకట్టుకొంది. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మహేష్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఇలా.. వంశీపైడి పల్లి ముగ్గురివాడు అనిపించుకొన్నాడు.

ఈ త్రీ స్టార్స్ లో తారక్ త్రివిక్రమ్ ‘అరవింద సమేత’తో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఇక, మహేష్ వంశీతోనే బిజీ అయిపోయాడు. రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు.