ల‌ష్క‌ర్ బోనాలు షురూ..

సికింద్రాబాద్ ఉజ్జ‌యినీ మ‌హంకాళీ బోనాలు ప్రారంభ‌మ‌య్యాయి. నేడు తెల్ల‌వారుజాము నుంచే భ‌క్తులు అమ్మ‌వారికి బోనాలు స‌మ‌ర్పించారు. అమ్మవారికి తొలిబోనం మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ దంప‌తులు స‌మ‌ర్పించారు. ల‌ష్క‌ర్ బోనాల సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు ఆల‌యానికి త‌ర‌లి వ‌స్తున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా ప్ర‌భుత్వం అన్ని ర‌కాల ఏర్పాట్లు చేసింది. భ‌ద్ర‌త ప‌రంగా పోలీసులు భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ బోనాల నేప‌థ్యంలో చాలామంది ప్ర‌ముఖులు అమ్మ‌వారిని ద‌ర్శించుకుని బోనం స‌మ‌ర్పిస్తారు. ఆద‌య్య న‌గ‌ర్ నుంచి బంగారు బోనాన్ని ఎంపీ క‌విత ఊరేగింపుగా తీసుకువ‌స్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మ‌ధ్యాహ్నం 1.30గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి‌‌ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇందుకు జ‌న‌సేన పార్టీ తెలంగాణ నాయ‌కులు ఏర్పాట్లు చేశారు.