అల్లుడే ముందు.. !


యంగ్ హీరో నాగ చైతన్య కన్ఫూజన్ లో పెట్టేశాడు. ఆయన నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’. మారుతి దర్శకత్వంలో ‘శైలాజా రెడ్డి అల్లుడు’ తెరకెక్కుతోన్నాయి. ఈ రెండింటిలో ఏ సినిమాని ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఐతే, ఈ రెండింటిలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శైలాజా రెడ్డి అల్లుడు’ ముందుగా విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారమ్.

ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ అత్తగా కనిపించనుంది. ఆమె పాత్ర సినిమాకే హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు. చైతూ సరసన అను ఇమ్మాన్యుయేల్ జతకట్టనుంది. తెలుగు తెరపై అత్త-అల్లుళ్ల కాంబోకి మంచి ప్రాధాన్యత ఉంది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే మారుతి ‘శైలాజా రెడ్డి అల్లుడు’ని రెడీ చేస్తున్నట్టు చెబుతున్నారు. నాగచైతన్య ‘సవ్యసాచి’ కూడా
రిలీజ్ కు రెడీ అవుతోంది. చందూ మొండేటి దర్శకుడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ‘శైలాజారెడ్డి అల్లుడు’ విడుదలైన కొద్దిగ్యాప్ లోనే ‘సవ్యసాచి’ రానుంది.

ఈ రెండు సినిమాల తర్వాత శివ నిర్మాణ సినిమా కోసం చైతూ-సమంత జతకట్టనున్నారు. పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించబోతున్న చిత్రమిది. ఇటీవలే ప్రారంభోత్సవం కూడా జరుపుకొంది. ఈ సినిమాలో చైతూ-సమంత పెళ్లైన జంటగా కనిపిస్తారట. ఐతే, గొడవల కారణంగా విడిపోతారట. అందుకు కారణాలేంటీ ? అనేది సినిమాలో చూపించబోతున్నాడు దర్శకుడు.