బీజేపీతో ప్రయాణం ఒక యాక్సిడెంట్ లాంటిది…!


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో అధికార టీడీపీపై విప‌క్షాలు చాలా విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అందులో అస‌లు టీడీపీ ఇంత‌కాలం బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంది, అది త‌ప్పు కాదా, ముందు తెలియ‌దా అంటూ ఇలా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు కూడా. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్, వైసీపీ అధినేత జ‌గ‌న్ తో స‌హా ఈ వ్యాఖ్య‌లు చేసిన‌వారే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ అంశంపై డైరెక్ట్ గా స్పందించలేదు టీడీపీ శ్రేణులు. అయితే తాజాగా ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల ఈ కామెంట్స్ కు స‌రైన కౌంట‌ర్ ఇచ్చారు.

బీజేపీతో ప్ర‌యాణం ఒక యాక్సిడెంట్ లాంటిద‌ని చెప్పారు య‌న‌మ‌ల‌. అందుకు ఆయ‌న ఓ ఉదాహ‌ర‌ణ కూడా చెప్పారు.. రాజమండ్రి వెళ్లాలని కార్ లో వెళతాం, దారిలో యాక్సిడెంట్ అవుతుంద ..అంత మాత్రాన. ప్రయాణం తప్పు అనలేం కదా… బీజేపీ తో పొత్తు కూడా అలాంటిదే… అంటూ వివ‌రించారు.