మాల్స్ నిర్వాహ‌కుల‌కు హైకోర్టు షాక్ ..!

మ‌ల్టీప్లెక్స్ ల‌లో తినుబండారాల ధ‌ర‌ల‌పై సోదాల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. మాల్స్ లో ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు ప్ర‌భుత్వం తూనిక‌లు, కొల‌తల అధికారులు రంగంలోకి దింపడంతో మాల్స్ నిర్వాహ‌కులు కోర్టును ఆశ్ర‌యించారు. సోదాలు చేయ‌వ‌ద్దంటూ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు ఈ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపింది. సోదాలు నిర్వ‌హించ‌వ‌ద్ద‌నం స‌రైన‌దికాదంటూ మాల్స్ నిర్వాహ‌కుల‌కు షాక్ ఇచ్చింది హైకోర్టు. సోదాలు నిర్వ‌హించేందుకు అధికారుల‌కు అనుమ‌తినిస్తూ, గురువారం పూర్తి నివేదిక ఇవ్వాల‌ని తూనిక‌లు, కొల‌త‌ల శాఖ‌కు ఆదేశాలిచ్చింది.