కోహ్లీ సెంచరీ.. అద్భత: !

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 172 బంతుల్లో 14 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 22వ శతకం. ఇంగ్లాండ్‌ గడ్డపై మాత్రం తొలి శతకం. దీంతో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 22 శతకాలు చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. ఎన్నో ఛేదనల్లో కోహ్లీ శతకాలు చేసుండొచ్చు. కానీ, అందరి కళ్లూ అతని పైనే ఉండగా.. అత్యంత ఒత్తిడిలో చేసిన ఈ సెంచరీ చరిత్రలో నలిచిపోయేదే. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 67 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. కోహ్లీకి తోడుగా ఉమేశ్‌ యాదవ్‌ (1; 4 బంతుల్లో) తోడుగా ఆడుతున్నాడు.