‘శ్రీనివాస కళ్యాణం’ సెన్సార్ రివ్యూ

‘శతమానం భవతి’ లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ శ్రీనివాస కళ్యాణం. నితిన్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. నందిత శ్వేత, ప్రకాశ్‌ రాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని వచ్చే శుక్రవారం (ఆగస్టు9)న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. సింగిల్ క‌ట్ లేకుండా ‘క్లిన్ యు’ స‌ర్టిఫికెట్ ని పొందింది. నితిన్ – రాశీఖన్నాల జంట తెరపై చూడముచ్చటగా ఉంది. మిక్కీ జే మేయర్ సంగీతం మాయచేసేలా ఉందని సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చెప్పినట్టు తెలిసిందే. ‘శతమానం భవతి’ మాదిరిగా ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకొనే హంగులు శ్రీనివాస కళ్యాణంలో ఉన్నాయన్నది సెన్సార్ టాక్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. నిండైన ఫామిలీస్ తో సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా ఉందని ట్రైలర్ తోనే అర్థమైంది.