లాల్ ద‌ర్వాజాలో బోనాల సంద‌డి

హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్స‌వాలు అట్టహాసంగా ప్రారంభ‌మ‌య్యాయి. మహాభిషేకం, బోనాల సమర్పణతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమ్మ‌వారికి మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. మాజీ మంత్రి దానం నాగేంద‌ర్, సీఎల్పీ నేత జానారెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యులు దేవేంద‌ర్ గౌడ్ దంప‌తులు, మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ తో పాటు ఇత‌ర అధికార‌, విప‌క్ష నేత‌లు, అధికారులు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.