‘బాహుబలి’ పేరు చెప్పి బకరా చేశారట !

హీరోయిన్ పూజా హెగ్డే తెలుగులో హవా చూపిస్తోంది. ఆమె వరుసగా స్టార్స్ హీరోల సినిమాలని దక్కించుకుంటోంది. ‘డీజే’లో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసిన తర్వాత పూజా దశ తిరిగింది. సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ‘సాహో’ తర్వాత ‘జిల్’ దర్శకుడు రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే ప్రేమకథా చిత్రంలో హీరోయిన్ గా పూజా ఎంపికైంది. ఇటీవలే ప్రభాస్, పూజాలపై ఫోటో షూట్ కూడా నిర్వహించారు.

ఇలాంటి స్వింగులో ఉన్న సమయంలో పూజాని బాహుబలి పేరు చెప్పి బకరా చేశారట ‘సాక్ష్యం’ నిర్మాతలు. వాస్తవానికి మహేష్ సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ తో జతకట్టేందుకు పూజ ఒప్పుకోలేదట. ఐతే, ‘సాక్ష్యం’ పంచభూతాలు నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న సినిమా. బాహుబలి రేంజ్ లో ఉంటుందని మాయ మాటలు చెప్పి పూజాని ఒప్పించారట. ‘సాక్ష్యం’ రిలీజ్ ముందే ప్రమోషన్స్ లోనూ ఇదే చెప్పారు. తాము ఓ మినీ బాహుబలి తీశామని గొప్పగా చెప్పుకొన్నారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఓ రేంజ్ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సాక్ష్యం’ ప్లాపు సినిమాల జాబితాలో చేరేందుకు రెడీగా ఉంది. సినిమా బాక్సాఫీసు వద్ద డీలా పడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. సాక్ష్యం రిజల్ట్ ని చూసి.. తనని బాహుబలి పేరు చెప్పి బకరాని చేశారని స్నేహితులతో చెప్పుకుంటుందట పూజా. ఇప్పుడు పూజా ఆశలన్నీ మహేష్ 25 పైనే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇక తనకు ఢోకా ఉండదని ఆశపడుతోంది.