ఆ వార్తలపై దిల్‌రాజు హర్టయ్యాడట !


‘శతమానం భవతి’ తర్వాత సతీష్ విగ్నేశ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా దిల్ రాజు దర్శకులకు పూర్తి స్వేచ్ఛనిస్తారని చెబుతుంటారు. అందుకే ఆయన దర్శకుల నుంచి మంచి అవుట్ పుట్ ని రాబట్టగలరని చెబుతుంతారు. ఐతే, ‘శ్రీ‌నివాస క‌ల్యాణం’ విష‌యంలోనూ.. దిల్ రాజు అన్ని విష‌యాల్లోనూ వేలు పెట్టి స‌తీష్‌ని తెగ విసిగించాడ‌ని వార్త‌లొచ్చాయి. ఇవి దిల్‌రాజు వ‌ర‌కూ చేరాయి.

ఈ వార్తలపై దిల్ రాజు స్పందించారు. ‘ఆ వార్త‌ల్ని చూసి నేను హ‌ర్ట్ అయ్యాను. నేను ద‌ర్శ‌కుల వెనుక మాత్ర‌మే ఉంటాను. మేమంతా కార్మికులం. క‌ల‌సి ప‌నిచేస్తాం. ఓ క‌థ విన్న త‌ర‌వాత ద‌ర్శ‌కుడితో నేను కూడా ప్ర‌యాణం చేస్తాను. ఆ ప్ర‌యాణంలో ఏం జ‌రుగుతుందో నాకు మాత్ర‌మే తెలుసు. ద‌య చేసి ఇలాంటి వార్త‌లు రాయొద్దు” అన్నారు. ఇక, ఈ సినిమా ప్రమోషన్స్ ని టైటిల్ కి తగ్గట్టుగానే ప్లాన్ చేశారు దిల్ రాజు. శ్రావణమాసంలో పెళ్లి చేసుకోబుతున్న వ‌ధూవ‌రులు త‌మ పెళ్లి శుభ‌లేఖ పంపితే.. శ్రీ‌నివాస క‌ల్యాణంకి సంబంధించిన ప‌ట్టువ‌స్త్రాలు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారు.