ప్రవీణ్ సత్తారు ఏమైపోయాడు ?


రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ‘పిఎస్ వి గరుడవేగ’ సూపర్ హిట్టయ్యింది. దర్శకుడిగా ప్రవీణ్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఐతే, ఇప్పటి వరకు సత్తారు కొత్త సినిమాని మొదలెట్టలేదు. ‘గరుడవేగ’ తర్వాత సత్తారు ఎనర్జిటిక్ హీరో రామ్ కి కథ వినిపించాడు. కానీ, క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని ప్రచారమైంది. నితిన్ తో సత్తారు ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయ్. ఐతే, ఆ వార్తలు నిజం కాలేదు.

ఇంతకీ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు ఎక్కడ ? ఏం చేస్తున్నాడో తెలుసా… ? ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి – దేవకట్టా సంయుక్తంగా తెరకెక్కిస్తున్న `బాహుబలి` వెబ్ సిరీస్ కి ప్రవీణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడట. తొమ్మిది ఎపిసోడ్లుగా తెరకెక్కించే ఈ వెబ్ సిరీస్ కి దేవకట్టా & టీమ్ తో కలిసి ప్రవీణ్ పని చేస్తున్నారట.మరీ.. ప్రవీణ్ సత్తారు నుంచి కొత్త సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.