కొత్త సెట్ లో ‘సైరా’ పోరాటం మొదలు !


మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నర్సింహారెడ్డి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన 151 సినిమా కోసం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్శింహారెడ్డి జీవిత కథని ఎంచుకొన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకొంటున్న ‘సైరా’ సినిమా సెట్‌ను షేర్‌లింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చి వేయడంతో.. షూటింగ్ కు అంతరాయం కలిగింది. జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా ‘సైరా’ సినిమా కోసం సెట్‌ వేశారని పేర్కొంటూ ఆ నిర్మాణాన్ని కూల్చి వేశారు.

ఇప్పుడు సైరా కోస కొత్త సెట్ రెడీ అయ్యింది. రేపటి నుంచి కొత్త షెడ్యూల్‌ మొదలుకానుంది. ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ఏకధాటిగా నెలరోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారు. బ్రిటిషర్స్, నరసింహారెడ్డి మధ్య సాగే సన్నివేశాలు, ఫైట్స్‌ చిత్రీకరిస్తారని సమాచారమ్. ఇక, ఆగస్ట్‌ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు.