హీరోగా గౌతం మేనన్‌ !


గౌతమ్‌ మేనన్‌… ఓ ట్రెండ్ సెట్టర్. ప్రేమ కధలు, పోలీసు కధలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు. హీరోల ఇమేజ్ తో సంబధం లేకుండా తను అనుకున్న కధనే చెబుతుంటాడాయన. అందుకే చాలా మంది హీరోలో వైవిధ్యం కోసం ఆయన్ని కోరుకుంటారు. ఇప్పటికే కమల్ హసన్ , సూర్య , అజిత్ లాంటి బడా స్టార్స్ తో సినిమాలు చేసేశారు గౌతం. ఇప్పుడాయన దర్శకుడు హీరోగా మారాడు.

జై అనే కొత్త దర్శకుడి చిత్రంలో గౌతం హీరోగా నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా కథను గౌతంకు జై వినిపించారట. చాలాసేపు ఆలోచించిన తర్వాత నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారమ్. ఆగస్టు 15న చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఇందులో గౌతంమేనన్‌కు జోడీగా ఎవరు నటిస్తున్నారనేది ఇంకా ఫైనల్ కాలేదు.