శ్రీవారిసేవలో ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రబృందం


సతీష్ విగ్నేశ దర్శకత్వంలో నితిన్-రాశీఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం “శ్రీనివాస కళ్యాణం”. దిల్ రాజు నిర్మాత. పెళ్లి గొప్పదనం గురించి చెప్పే ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించింది. నితిన్, రాశీఖన్నా, సతీష్ విగ్నేష్, రాజేంద్ర ప్రసాద్, దిల్ రాజు.. తదితరులు శ్రీవారిని దర్శించుకొన్న వారిలో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘శతమానం భవతి’ లాంటి ఘన విజయం తర్వాత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’. ఇప్పటికే సినిమా చూసిన సినీ ప్రముఖులు సినిమా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా చూశాక.. ఇలా పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుందని చిత్రబృందం చెబుతోంది.
రేపు ప్రేక్షకుల మధ్య థియేటర్స్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ జరగనుంది. ఆ పెళ్లిని చూసి తరించండి.. మరి.