‘ఎఫ్2’ ఆగిపోయే ప్రమాదం ?

హిట్ ఇచ్చిన దర్శకుడికి మరో అవకాశం ఇవ్వడం దిల్ రాజు ప్రత్యేకత. ‘రాజా ది గ్రేట్’తో హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రాఘవపూడికి కూడా మరో ఛాన్స్ ఇచ్చాడు. అదే ‘ఎఫ్ 2’ మల్టీస్టారర్. ఈ సినిమాలో వెంకీ-వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ఐతే, ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం నుంచి బయటపడినట్టు సమాచారమ్.

ఈ సినిమా విషయంలో దిల్ రాజు-అనిల్ రాఘవపూడి మధ్య చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. సాధారణంగా దిల్ రాజు బ్యానర్ లో కీలక సాంకేతిక నిపుణలు మాత్రమే మారతారు. మిగిలినవారు మారరు. ప్రతి సినిమాకు వారే కంటిన్యూ అవుతుంటారు. ఐతే, వీరిలో ఒకరిద్దరితో అనిల్ రావిపూడికి సెట్ కాలేదట. ఈ విషయాన్ని దిల్ రాజుకు చెప్పిన పెద్దగా పట్టించుకోలేదట. ఇది దర్శకుడుని బాధించిందని తెలిసింది.

చివరకు సినిమాని క్యాన్సిల్ చేసుకొనే అలోచన కూడా చేశాడట అనిల్ రాఘవపూడి. ఐతే, ఈ చిన్ని విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అవసరమా ? అని కంటిన్యూ అయినట్టు తెలుస్తోంది. ఐతే, దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా మాత్రం చేయకూడదని స్ట్రాంగ్ డిసైడ్ అయినట్టు సమాచారమ్.

ఇక, ఈ సినిమాలో వెంకీ-వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా కనిపించనున్నారు. వీరు తమ భార్య, లవర్ నుంచి తప్పించుకునేందుకు ఫారిన్ వస్తే, వాళ్లూ అక్కడికే వస్తారని, ‘ఫన్’తో కథ నడుస్తుందని చెబుతున్నారు. ఇందులో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఎఫ్ 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తొంది.