చరణ్-తారక్ మల్టీస్టారర్ లో మహేష్ కూడా.. !

బాహుబలి’ తర్వాత రాజమౌళి రామ్ చరణ్, తారక్ లతో ఓ మల్టీస్టారర్ (#RRR) ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని నవంబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని జక్కన్న భావిస్తున్నారు. సినిమాలో తారక్, చరణ్ లకు సమాన ప్రాధాన్యత కలిగేలా అద్భుతంగా తీర్చిదిద్దాడట. ఇందులో తారక్, చరణ్ లతో పాటు ప్రిన్స్ మహేష్ బాబుని భాగస్వామిని చేయాలని రాజమౌళి ఆలోచన చేస్తున్నట్టు సమాచారమ్.

సినిమాలో మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చెప్పించాలని రాజమౌళి అనుకొంటున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచనున్నారు. సినిమా విడుదల సమయంలో మహేష్ కూడా ఉన్నాడని అభిమానులకు సప్రైజ్ ఇవ్వనున్నారంట. ఇటీవల ఒకట్రెండు వేదికలపై చరణ్, తారక్, మహేష్ కలిసి సందడి చేశారు. అది వారి అభిమానులకు బాగా నచ్చేసింది. ఇప్పుడు ఒకే సినిమాలో ఈ త్రీ-స్టార్స్ అంటే అభిమానులకు పండగే.