‘పవన్ కుర్చీలో ఎన్టీఆర్’ని కూర్చోబెట్టాడు !

తారక్ – త్రివిక్రమ్ తొలిసారి కలిశారు. ‘అరవింద సమేత’ కోసం జతకట్టారు. సినిమా సెట్స్ మీద ఉండగానే రికార్డుల వైపు చూస్తోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిపోతుంది. శాటిలైట్ రైట్స్ రూ. 23.5కోట్లకు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ లోనూ అదే రేంజ్ కనబడింది. మొత్తంగా.. విడుదకలకు ముందే రూ. 100కోట్లు తెచ్చిపెట్టనుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరో రెండు రోజుల్లో ఈ అంచనాలు డబుల్ అయ్యేలా కనిపిస్తున్నాయి. స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. చిత్రబృందం ప్రీ-లుక్ విడుదల చేసింది. ఓ ఫైట్ సీన్ లో విలన్ ని ఇరగదీసి.. కుర్చీలో కూర్చున్న ఎన్టీఆర్ లుక్ ని వదిలారు. ఐతే.. ఈ లుక్ ‘అజ్ఝాతవాసి’ ఫస్ట్ లుక్ ని పోలి ఉండటం తారక్ అభిమానులని టెన్షన్ పెడుతోంది.

పవన్ కళ్యాణ్ కుర్చీలోనే ఎటీఆర్ ని కూర్చోబెట్టాడు త్రివిక్రమ్. మరీ.. అజ్ఝాతవాసి రిజల్ట్ రిపీట్ అవుతుందేమోనని భయపడిపోతున్నారు. అజ్ఝాతవాసి ఫస్ట్ లుక్ లో పవన్ కుర్చీని తిప్పుతూ కనిపించాడు. ఇప్పుడు అరవింద సమేత ప్రీ-లుక్ లో ఎన్ టీఆర్ ఆ కుర్చీలో కూర్చోని కనిపించాడు అంతే.. మిగితాదంతా సేమ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక, రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో అరవింద సమేత తెరకెక్కుతోంది. ఇందులో తారక్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని చెబుతున్నారు. తారక్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. థమన్ సంగీతం. రాథాకృష్ణ నిర్మాత. దసరా కానుకగా సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.