యాదాద్రి అభివృద్ధి ప‌నుల ప‌రిశీల‌న‌.

యాదాద్రి పున‌ర్నిర్మాణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప‌లువురు అధికారులు, నేత‌లు ప‌నులు జ‌రుగుతున్న తీరును ప‌రిశీలిస్తున్నారు. తాజాగా సీఎంవో అధికార కుటుంబ స‌మేతంగా యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామివారిని ద‌ర్శించుకుని పున‌ర్నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు. ప‌నుల పురోగ‌తిపై ఆయ‌న సంతృప్తి వ్య‌క్తం చేశారు. వైటీడీఏ వైస్ చైర్మ‌న్ కిష‌న్ రావు, ఆల‌య ఈవో గీతారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ అనితారామ‌చంద్ర‌న్, స్థ‌ప‌తులు ఆల‌య పున‌ర్నిర్మాణ ప‌నుల పురోగ‌తిని ఆయ‌న‌కు వివ‌రించారు.