రాహుల్ నివాళితో మ‌లిన‌మైన స్థూపం

తెలంగాణ ఉద్యమంలో అనేక మందిని చంపిన చరిత్ర కాంగ్రెస్ ద‌ని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్ విమ‌ర్శించారు. రాహుల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళులు అర్పించి మ‌లినం చేశార‌ని ఆయ‌న అన్నారు. అందుకే పాల‌తో అమ‌రుల స్థూపాన్ని శుద్ధిచేసామ‌ని చెప్పారు. రాహుల్ గాంధీ తిరిగి వెళ్లే లోపు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాన చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

విభజన సమస్యలపై మాట్లాడని రాహుల్ ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారని, తెలంగాణ హక్కులు మాత్రం పట్టించుకోవడం లేదని సుమ‌న్ మండిప‌డ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన స్క్రిప్టును చదివి రాహుల్ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. ఏపీలో కాంగ్రెస్ ను నిలబెట్టడం కోసం రాహుల్ గాంధీ చంద్రబాబు వద్ద కాంగ్రెస్ ను తాకట్టు పెట్టారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని ఆయ‌న విమ‌ర్శించారు.