శ్రీమంతం వేడుకలో చిందేసిన రంభ


సీనియర్ హీరోయిన్ రంభ సినిమాలకు దూరమై చాన్నాళ్లయింది. పెళ్లి తర్వాత ఒకట్రెండు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో మెరిసింది. ప్రస్తుతం టీవీ షోలు చేసుకొంటోంది. అవకాశం వస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఇప్పటికే దర్శక-నిర్మాతలకు సంకేతాలు కూడా ఇచ్చింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ హ్యాపీగా సాగడం లేదని గతంలో వార్తలొచ్చాయ్. భర్తతో విడాకులు అంటూ.. కోర్టు కెళ్లినట్టు ప్రచారం జరిగింది.

ఇప్పుడా సమస్యలన్నీ తీరినట్టు కనబడుతోంది. ఆమె సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది. త‌న భ‌ర్తతో క‌లిసి హ్యాపీగా ఉంటున్న న‌టి రంభ త్వ‌ర‌లో మ‌రో బేబీకి జ‌న్మ‌నివ్వ‌బోతుంది. రంభ‌కి ప్ర‌స్తుతం లాన్య(7), శాషా(3) అనే ఇద్ద‌రు కూతుళ్లు ఉండ‌గా, త్వ‌ర‌లో వారింట మ‌రో బేబి అడుగుపెట్ట‌నుంది. సోమవారం రంభ శ్రీమంతం ఘ‌నంగా జ‌రిపారు వారి కుటుంబ స‌భ్యులు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎంతో సంతోషంగా ఉన్న రంభ త‌న బంధువుల‌తో క‌లిసి స్టెప్పులు వేసింది. రంభ భ‌ర్త ఆమెపై పూల వ‌ర్షం కురిపించారు. రంభ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీమంతంకి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. చాన్నాళ్ల తర్వాత రంభ ఇంత ఆనందంగా ఉండటం చూశామంటూ ఆమె అభిమానులు చెప్పుకొంటున్నారు.