సప్రైజ్ : ‘గీత గోవిందం’లో ఆ ఇద్దరు హీరోయిన్స్

యంగ్ హీరో విజయ్ దేవకొండ తెరమీద ఎప్పుడెప్పుడు చూద్దామని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’గా అదరగొట్టిన విజయ్.. ఆయన తాజా చిత్రం ‘గీత గోవిందం’లో ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. స్వాంత్రత్య్ర దినోత్సవం కానుకగా విజయ్ దేవరకొండ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే బెనిఫిట్ షోలు పడిపోయాయి.

‘గీత గోవిందం’లోనూ.. విజయ్ దేవరకొండ రొమాంటిక్ గానే కనిపించాడు. కాకపోతే.. ‘అర్జున్ రెడ్డి’లాగా నాటు రొమాంటిక్ కాదబ్బా. ఈసారి ఫ్యామిలీ టైపు. ఆటపట్టించడం, అపార్థాలు, ఎమోషన్స్ తో విజయ్-రష్మిక ప్రేమకథ సాగింది. దీంతో పాటు ఎంటర్ టైన్ మెంట్ కు కొదవేమీ లేదు. సినిమాలో నిత్యామీనన్ ఎంట్రీ ప్రేక్షకులకు సప్రైజ్ ఇచ్చింది. నిత్యాతోనే విజయ్ తన ప్రేమకథని చెబుతుండటంతో కథ మొదలైంది. ఆ కొద్దిసేపటికే అను ఇమ్మాన్యూయేల్ స్పెషల్ పాత్రలో కనిపించి ఆకట్టుకొంది.

నిత్యామీనన్, అనుఇమ్మాన్యూయేల్ ఎంట్రీతో గీత గోవిందం మరింత కలర్ ఫుల్ గా మారింది. ఫస్టాఫ్ రొమాంటిక్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. మరికొద్దిసేపటిలో గీత గోవిందం పూర్తి రివ్యూని మీ ముందు ఉంచుతుంది.. మీ tsmirchi.com.