ఎర్ర‌కోట‌పై ఎగిరిన జెండా..

72వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు ప్రారంభమయ్యాయి. తన అధికారిక నివాసం నుంచి బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని త్రివిధ ద‌ళాల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్ర‌కోట‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లను వీక్షించేందుకు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు, రాజ‌కీయ నాయకులు హాజ‌ర‌య్యారు.