నమ్రతపై మహేష్’కు ఫిర్యాదు


భార్య నమ్రతపై సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫిర్యాదు అందింది. దీంతో మహేష్ ఆలోచనలో పడినట్టు సమాచారమ్. ఇంతకీ నమ్రతపై మహేష్ కు ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా ? ఆయన పిల్లలు గౌతమ్, సితార లే.
ఈ విషయాన్ని స్వయంగా నమ్రతనే తెలపడం ఆకట్టుకుంటోంది.

మహేష్ తో పిల్లలు ఏదో చెబుతున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది నమ్రత. దీనికి ‘తాను కాదన్న వారి కోరికను తీర్చుకునేందుకు తండ్రి వద్ద పంచాయితీ పెట్టారని’ కామెంట్ పెట్టింది. ఇంతకీ మహేష్ పిల్లలు ఏమడిగారు ? అన్న విషయాలని మాత్రం తెలపలేదు నమ్రత.

ఇక, మహేష్ ఫ్యామిలీ హీరో అన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఏమాత్రం విశ్రాంతి దొరికిన ఫ్యామిలీతో గడుపుతుంటారు. వారితో సప్రైజ్ ఫారిన్ టూర్స్ ని ప్లాన్ చేస్తుంటారు. గౌతమ్, సితారలను మహేష్ ఎంత గారాబంగా పెంచుతాడు. ఐతే, వీరిద్దరు తల్లి నమ్రతపై తండ్రి మహేష్ కు ఫిర్యాదు చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గ మారింది.