రాశీకి రాసిపెట్టి లేదు !

రష్మిక మందన, విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’గా థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. వీరి ప్రేమ కథ ప్రేక్షకులని ఫిదా చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా గీత గోవిందం బాగా నచ్చేశారు. చిత్రబృందాన్నిప్రత్యేకంగా అభినందిస్తూ ట్విట్ చేశాడు మహేష్. విజయ్, రష్మికల నటన చాలా బాగుందంటూ కితాబిచ్చారు.

ముఖ్యంగా గీత పాత్రలో రష్మిక మాయ చేసిందని చెప్పుకొంటున్నారు. ఆ పాత్ర రష్మికకు రాసి పెట్టి ఉందని సినిమా ఆడియో వేడుకలో నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అది నిజమే. ఎందుకంటే ? ఈ పాత్ర కోసం ముందుగా లావణ్య త్రిపాఠిని అనుకొన్నారంట. ఆ తర్వాత రాశీఖన్నాని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆమె సంప్రదించారు కూడా. ఐతే, ఆమె అధిక రెమ్యూనరేషన్ అడగడంతో.. గీత పాత్ర రష్మిక దగ్గరకు వెళ్లింది.

ఇప్పుడు ‘గీత గోవిందం’ ఫలితాన్ని చూసిన తర్వాత రాశీఖన్నా తెగ ఫీలవుతుందట. ‘తొలిప్రేమ’ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ‘శ్రీనివాస కళ్యాణం’తో మరో మెట్టెక్కింది. ఈ ఫ్లోలో గీత గోవిందం కూడా పడివుంటే.. రాశీ రేంజ్ మరింతగా పెరిగేది . పాపం.. గీత పాత్ర రాశీకి రాసిపెట్టినేనట్టుంది.