రాశీతో విజయ్ రొమాన్స్

రొమాన్స్ లో మొనగాడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’లో అదే యావతో కనిపించాడు. ఈ తరం దేవదాసుగా ఆకట్టుకొన్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ‘గీత గోవిందం’లాంటి రొమాంటి ఎంటర్ టైనర్ ని ఎంచుకొన్నాడు. ఇప్పుడు థియేటర్స్ విజయ్-రష్మికల రొమాన్స్ ని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పుడు రష్మిక స్థానంలోకి రాశీఖన్నా రానుంది. క్రాంతి మాధవన్ దర్శకత్వంలో విజయ్ చేయబోయే సినిమా కోసం రాశీఖన్నాని తీసుకొన్నారు. వాస్తవానికి ‘గీత గోవిందం’ సినిమాలో గీత పాత్ర కోసం రష్మిక కంటే ముందు రాశీఖన్నానే సంప్రదించారట. ఆమె పారితోషికం విషయంలో బెట్టు చేయడంలో ఆ ఆఫర్ రష్మికకు దక్కింది. గీత పాత్ర రష్మికకు రాసిపెట్టి ఉంది అంతే.

గీత పాత్ర మిస్సయిన విజయ్ తో రొమాన్స్ చేసే అవకాశం రాశీకి దక్కింది. క్రాంతి మాధవన్ విభిన్నమైన సినిమాలు తెరకెక్కిస్తుంటారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన శర్వానంద్-నిత్యామీనన్ ల ‘మళ్లీ మళ్లీ రానీ రోజు’ ప్రేక్షకులని ఆకట్టుకొంది. ఇప్పుడు విజయ్ తో ఓ డిఫరెంట్ సినిమా తీయబోతున్నాడు క్రాంతి మాధవన్. ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’లో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవన్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.