కేటీఆర్ ‘లుచ్చా’ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఫైర్

కాంగ్రెస్ వాళ్లు లుచ్చాలంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై పెద్ద దుమారం రేగుతోంది. కాంగ్రెస్ నేత‌లు మంత్రి కేటీఆర్ పై సీరియ‌స్ విమ‌ర్శ‌లు కురిపించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు ఘాటుగా స్పందించారు.
కేటీఆర్ త‌మ‌ని లుచ్చాలు అని ప్రాజెక్ట్ లపై చర్చను పక్కదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నాడని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు. కేటీఆర్ అడ్డ‌గోలుగా మాట్లాడ‌టం మానుకోవాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు.
తెలంగాణ ఇచ్చినంకా, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇవ్వనందుకా, 12 శాతం మైనారిటీలకు రేజర్వేషన్ ఇస్తామని ఇవ్వనందుకా, డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వ‌నందుకు లుచ్చాగాళ్ల‌మా అంటూ ఎద్దేవా చేశారు.

ఇంగ్లీష్ స్కూల్లో చదివి, అమెరికాలో పనిచేసిన కేటీఆర్ నాగరికూడనుకున్నామ‌ని, తన స్ధాయి మర్చిపోయి మాట్లాడిన కేటీఆర్ నాగరికుడా? అనాగరికుడా? అంటూ భ‌ట్టి ప్ర‌శ్నించారు. కుసంస్కారంగా మాట్లాడటం ఎవరికి మంచిది కాదని, అసభ్య పదజాలం ప్రజాస్వామ్య విలువలకు భంగం క‌లిగిస్తుంద‌ని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. అలా మాట్లాడే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయ‌న చెప్పారు. తాను కూడా అలా మాట్లాడగలను కానీ మంచిది కాదని ఆయ‌న తెలిపారు. కేసీఆర్ తన కేబినెట్ మంత్రులకు ఎలా మాట్లాడాలో హితువు చెప్పాలన్నారు.

అధికార మదంతో అమెరికాలో చిప్పలు కడుక్కునేవాళ్లు కూడా త‌మ‌ను లుచ్చాగాళ్లని విమర్శిస్తున్నారని పొన్నం ప్ర‌భాక‌ర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ రాజ‌కీయ జ‌న్మ కూడా కాంగ్రెస్ లోనేన‌ని ఆయ‌న గుర్తు చేశారు. కేటీఆర్ చరిత్ర బయట పెడితే బయట తిరగడలేడని, కేసీఆర్ ను మూడు సార్లు గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ఏం చేసారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రస్టేషన్స్ తో మాటలు జారితే జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కేటీఆర్ జెన్నకిడిసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.