రెండో పెళ్లి చేసుకొన్న యాంకర్ ఝాన్సీ మాజీ భర్త !

నటి, యాంకర్‌ ఝాన్సీ మాజీ భర్త జోగినాయుడు రెండో పెళ్లి చేసుకొన్నారు. తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్యను పెళ్లాడాడు. గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది.

బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన జోగి బ్రదర్స్‌… వెండితెరపై కూడా రాణించారు. దర్శకుడు అవ్వాలని వచ్చిన జోగినాయుడు నటుడిగా స్థరపడిపోయారు. జోగి నాయుడు, ఆయన అన్నయ్య కృష్ణంరాజులు ‘జోగి బ్రదర్స్’గా గుర్తింపు తెచ్చుకొన్నారు. వీరిద్దరు కలిసి జెమిటీ టీవీలో చేసిన ‘జోగి బ్రదర్స్’ పాపులర్ అయ్యింది. ఆ సమయంలోని ఝాన్సీతో ప్రేమ.. పెళ్లికి దారితీసింది. వీరిద్దరికి ఓ పాప కూడా జన్మించింది.

ఆ తర్వాత వీరిద్దరి సంసార జీవితంలో సమస్యలు తలెత్తాయి. ఓ పదేళ్లపాటు వీరిద్దరి మాటల్లేవ్. ఓ ఎనిమిదేళ్ల పాటు జోగినాయుడు తనకు నరకం చూపించాడని ఝాన్సీ తన స్నేహితులతో చెప్పుకొని బాధపడినట్టు అప్పట్లో వార్గలొచ్చాయ్. ఫైనల్ గా వీరు కోర్టు నుండి విడాకులు తీసుకొన్నారు. తాజాగా, జోగినాయుడు రెండో పెళ్లి చేసుకొన్నారు.