ఈ నెల 21నుంచి యాదాద్రిలో ప‌విత్రోత్స‌వాలు.

యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామివారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు ఆల‌య అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి 23 వ‌ర‌కు మూడు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నట్లు ఆల‌య ఈవో గీతారెడ్డి తెలిపారు. ప‌విత్రోత్స‌వాల నేప‌థ్యంలో మూడు రోజుల పాటు స్వామివారి కైంకర్యాల‌లో కొన్నింటిని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. సుద‌ర్శ‌న‌ నార‌సింహ హోమం, శాశ్వ‌త క‌ళ్యాణం, శాశ్వ‌త బ్ర‌హ్మోత్స‌వాల‌ను మూడు రోజులు ర‌ద్దు చేస్తున్నారు. తిరిగి 24నుంచి య‌థావిధిగా నిత్య క‌ళ్యాణ‌, హోమం జ‌రుగుతాయ‌ని చెప్పారు.