జ‌న‌సేన‌లో చేరిక‌ల సంద‌డి..

కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ల నుంచి సీనియర్ లీడర్స్ సహా కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో జనసేనలో చేరారు. మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో మాజీ మంత్రి గోపాలకృష్ణ, ఆయన పెద్ద కుమారుడు శశిధర్ పార్టీలో చేరారు. 500 మంది అనుచరులతో కలిసి కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చిన ముత్తా గోపాలకృష్ణకు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేనలో చేరిన వాళ్ళలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుళ్లబ్బాయి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, టీడీపీ కార్పోరేటర్ మాకినేడి శేషు కుమారి ఉన్నారు.