రకుల్ స్వీడు తగ్గింది

రకుల్ ప్రీత్ సింగ్ కు స్వీడు ఎక్కువ. ఆ స్వీడుతోనే అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒకేసారి మూడు నాలుగు సినిమాల్లో నటించేది. యంగ్ హీరోలతో జతకడుతూనే.. స్టార్ హీరోలతోనూ ఆడిపాడేది. ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తప్ప మెగా హీరోలందిరితోనూ జతకట్టిన రికార్డు రకుల్ పేరిట ఉంది. అలాంటి రకుల్ ఈ మధ్య జోరు తగ్గించింది. ఇప్పుడు తమిళం, హిందీ చిత్రాలపై దృష్టిపెట్టింది.

అయితే త్వరలోనే ఆమె హైదరాబాద్‌ తిరిగిరానుంది. ఆమె ‘ఎన్టీఆర్‌’ చిత్రం కోసం రంగంలోకి దిగబోతోంది. ఇందులో శ్రీదేవిగా కనిపించనుంది రకుల్. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తిచేయక.. కాస్త విరామం తీసుకొనుందట రకుల్. విరామం తర్వాత మంచి కథలని ఎంపిక చేసుకొని ముందుకెళ్తానని చెబుతోంది.

ఇప్పటికే స్వీటీ అనుష్క, సమంత ఇదే తరహా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన కథలని ఎంచుకొంటున్నారు. ఇప్పుడు రకుల్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది. ఎన్ టీఆర్ చిత్రంలో శ్రీదేవి పాత్ర రకుల్ కు మంచి పేరు తీసుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా అదే రేంజ్ సినిమాలని ఎంచుకొంటూ ముందుకు వెళ్లాలనే ఆలోచనలో రకుల్ ఉన్నట్టు సమాచారమ్.