సాయేషా బాగా పెంచేసింది

‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ భామ సాయేషా సైగల్‌. ఈ సినిమా ప్లాప్ కావడంతో.. తెలుగులో మరో అవకాశం రాలేదు. ఇంతలో కోలీవుడ్ పిలుపురావడంతో అటు వెళ్లింది. ‘వనయుద్ధం’లో జయం రవితో రొమాన్స్‌ చేసింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సాయేషా చేసిన ఆర్య ‘గజనీకాంత్’, విజయ్‌సేతుపతి ‘జుంగా’, కార్తీ ‘కడైకుట్టి’ సినిమాలు హిట్ గా నిలిచాయి. దీంతో ఈ అమ్మడు రేంజ్ పెరిగిపోయింది.

వరుస హిట్స్ ఇచ్చిన జోష్ లో కోలీవుడ్ స్టార్స్ కు గ్రాండ్ బర్త్ డే పార్టీ ఇచ్చింది. ప్రభుదేవా, ఆర్య.. లాంటి స్టార్స్ ఈ పార్టీకి విచ్చేసి మజా చేశారు. ఈ విషయం ప్రక్కన పెడితే.. సాయేషా తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసినట్టు సమాచారమ్. ఈ అమ్మడు కావాలంటే.. ఒకటి కాదు రెండు కోట్లకు చెల్లించాల్సిందేనంటున్నారు. ఈ బ్యూటీకి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఆ పారితోషికం ఇచ్చేందుకు దర్శక-నిర్మాతలు రెడీగా ఉండటం విశేషం.