కేర‌ళ వ‌ర‌ద‌ల‌కు అయ్య‌ప్ప ఆగ్ర‌హ‌మే కార‌ణ‌మా..?

మునుపెన్న‌డూ లేనంత‌గా కేరళలో వ‌ర‌ద విల‌య తాండ‌వం చేసింది. ఎడ‌తెఎరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాలే ఈ వ‌ర‌ద‌ల‌కు కార‌ణ‌మ‌నేది అంద‌రికీ తెలిసిందే. అయితే కేర‌ళ‌ వరదల్లో మునిగిపోవడానికి శబరిమల వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యమే కారణమంటూ కొంద‌రు ఛాందసవాదులు ట్వీట్లు చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. కేరళ వరదలకు, శబరిమలలో మహిళల ప్రవేశానికి ముడిపెట్టి ట్వీట్‌ చేసిన వారిలో ఆర్‌బీఐ బోర్డు సభ్యుడితో పాటు ఆర్ఎస్ఎస్ ప్రముఖుడూ ఉండటంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయారు. వరదలను మతపరమైన విషయాలతో ముడిపెట్టొద్ద‌ని, ఏదైనా చేయగలిగితే వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయండి అంటూ నెటిజ‌న్లు ఈ విష‌యంపై ఆగ్ర‌హంవ్య‌క్తం చేశారు.మొత్తంగా అయ్య‌ప్ప ఆగ్ర‌హం వ‌ల్లే కేర‌ళ వ‌ర‌ద ముంపు గురైందంటూ సోష‌ల్ మీడియాలో ఈ వార్త ఓ రేంజ్ లో వైర‌ల్ అవుతోంది.